మేడ్చల్ : మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజేష్ అనాఖ్, రాజేష్ బాచుపల్లిలో నివాసం ఉంటూ ఐడీఏ బొల్లారంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. క్రాంతినగర్లో ఓ గది అద్దెకు తీసుకొని గుట్కా ప్యాకెట్లు నిల్వ చేసి విక్రయాలకు పాల్పడుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ రూ. 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.