న్యూఢిల్లీ : సైబర్ నేరాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రజల్లో ఎంతగా అవగాహన పెంచుతున్నా సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూనే ఉన్నారు. తాజా ఘటనలో వాట్సాప్ కాల్ ద్వారా వర్క్ ఫ్రం హోం ఆఫర్తో నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ. 70 లక్షలు కాజేశారు. వర్క్ ఫ్రం హోంతో పెద్దమొత్తంలో ఆర్జించవచ్చని మభ్యపెట్టిన స్కామర్లు బాధితుడిని నిండా ముంచారు.
గురుగ్రాంకు చెందిన ఓ వ్యక్తిని ఫిబ్రవరి 27న ఓ మహిళ వాట్సాప్ కాల్ చేసింది. ఇంటి నుంచి పనిచేస్తూ ఆన్లైన్ జాబ్ ద్వారా భారీగా సంపాదించవచ్చని నమ్మబలికింది. ఆపై స్కామర్లు వ్యక్తిని టెలికాం గ్రూప్లో కనెక్ట్ అయి చిన్న టాస్క్లు ఇచ్చి అవి పూర్తి చేయగానే చెల్లింపులు చేయడం ద్వారా అతడి నమ్మకాన్ని చూరగొన్నారు.
రవీనా కౌర్ అనే మహిళకు స్కామర్లు అతడిని పరిచయం చేయగా ఆమె బాధితుడిని పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రిటన్స్ పొందవచ్చని మభ్యపెట్టింది. తొలుత పది వేల వరకూ అతడికి ముట్టచెప్పిన మీదట బాధితుడిచే నాలుగు నెలల కాలంలో ఏకంగా రూ. 69.9 లక్షలు ఇన్వెస్ట్ చేయించింది. పెద్దమొత్తంలో సొమ్ము పెట్టుబడి పెట్టిన అనంతరం విత్డ్రా చేసుకునేందుకు వ్యక్తిని అనుమతించకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More
Huzurnagar | సినీ ఫక్కీలో.. హుజుర్నగర్లో అర్ధరాత్రి నవ వధువు కిడ్నాప్