హైదరాబాద్ : దురంతో ఎక్స్ప్రెస్లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సికింద్రాబాద్ – హజ్రత్ నిజాముద్దీన్ రైలు ఏసీ కోచ్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నది. రైల్వే పోలీసులకు టికెట్ కలెక్టర్ సమాచారం అందించారు. దీంతో సదరు వ్యక్తిని కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లో పట్టుకున్నారు. మంచిర్యాల వద్ద రైలులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. సదరు వ్యక్తి ఆర్మీ జవాన్గా తెలుస్తున్నది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.