హైదరాబాద్ : ఎన్నో ఆశలతో వివాహ బంధంలో అడుగుపెట్టిన జంటను రోడ్డు ప్రమాదం వెంటాడింది. పెళ్లయిన 24 గంటల్లోపే వరుడు మృత్యువాతపడగా.. కోమాలోకి వెళ్లిన వధువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడి వివాహం చెన్నైకి చెందిన కనిమొళితో తిరుపతిలో జరిగింది.
వివాహం అనంతరం అత్తవారింటికి వెళ్తున్న సమయంలో బెంగళూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నవ వధూవరులకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే వారిని ఆసుప్రతికి తరలించారు. చికిత్స పొందుతూ వరుడు మృత్యువాతపడ్డారు. వధువు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వరుడే కారు వాహనం నడిపినట్లు తెలుస్తున్నది. దీంతో శేరిలింగంపల్లిలో విషాదం అలుముకున్నది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.