న్యూఢిల్లీ: ఎంతమంది స్మగ్లర్లను కటకటాల వెనక్కి పంపినా బంగారం అక్రమ రవాణాకు మాత్రం ఫుల్స్టాప్ పడటంలేదు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు ఏకంగా రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ కోటి రూపాయలు ఉంటుందని అధికారులు చెప్పారు.
కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్కు చెందిన వ్యక్తి ఓ కేసులో అరెస్టయ్యి దుబాయ్లో మూడేండ్లుగా నిర్బంధంలో ఉన్నాడు. తాజాగా జైలు నుంచి విడుదలై ఇవాళ స్పెస్జెట్ విమానంలో ఢిల్లీకి చేరుకున్నాడు. అయితే, విమానంలో తనకిచ్చిన లైఫ్ జాకెట్ను ఫ్లైట్ సీటు కిందే వదిలేసి కిందకు దిగాడు. ఇది గమనించిన కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
విమానం సీటు కింద వదిలేసిన లైఫ్ జాకెట్లో రెండున్నర కిలోల బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. బంగారం సీటు కింద ఎందుకు దాచిపెట్టావని అధికారులు నిందితుడిని ప్రశ్నించగా.. తనకు ఆ బంగారం ఇచ్చిన వాళ్లు దాన్ని సీటు కిందే వదిలేయమని చెప్పారన్నాడు. కాగా, ఈ బంగారం స్మగ్లింగ్పై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని కస్టమ్స్ అధికారులు చెప్పారు.