హైదరాబాద్ : శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు. దుబాయి నుంచి FZ-439 విమానంలో హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 316.40 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.15.71లక్షలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఏసీ క్వనర్టర్లో దాచి ఉంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం రవాణాపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.