హైదరాబాద్ : శంషాబాద్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయి నుంచి AI952 నంబరు గల విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.15.75లక్షల విలువైన 320 గ్రామాల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని డియోడరెంట్ సీసాలు, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ స్కేల్స్, టాయ్ కార్లు, అలారం గడియారాల్లో దాచి అక్రమంగా తరలిస్తుండగా.. తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.