శంషాబాద్ : మరోసారి శంషాబాద్ ఎయిర్పోర్టులో స్మగ్లర్స్ బంగారం స్మగ్లింగ్ కు విఫలయత్నం చేశారు.శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం… షార్జా నుంచి హైదరాబాద్కు జి9 726 విమానంలో ఓ ప్రయాణీకుడు వచ్చాడు.
అతనిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు. ప్యాంట్ అంతర్భాగంలోని ప్యాకెట్లో పేస్టు రూపంలో 234.05 గ్రాముల బంగారం స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించారు.
పట్టుబడిన బంగారం విలువ రూ. 11.54 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.