హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో బంగారం భారీగా మాయమైంది. పని మనిషే బంగారం దొంగిలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హైదర్గూడలో ఉంటున్న ఓ వ్యక్తి ఇటీవలే నారాయణగూడకు మకాం మార్చాడు. అయితే ఇంటి సామాన్లు తరలిస్తున్న సమయంలో బంగారం దాచి ఉంచిన బాక్సు అదృశ్యమైంది. దీంతో బాధిత వ్యక్తి నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను ప్రశ్నించారు. ఇక ఆ ఇంట్లో ఎప్పట్నుంచో పని చేస్తున్న పని మనిషిని కూడా పోలీసులు విచారించారు. ఆమెనే బంగారం దొంగిలించినట్లు విచారణలో తేలింది. పని మనిషి నుంచి 81 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం బంగారాన్ని బాధిత వ్యక్తికి అప్పగించారు.