హైదరాబాద్ : వెంకటాద్రి రైల్లో ప్రయాణికుని బ్యాగులోంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ప్రాంతానికి చెందిన రాజేశ్వర్రావు కుమారుడు జి.వినిష్కుమార్(31)ఇటీవల తిరుపతికి వెళ్లాడు. తిరిగి ఈ నెల 8న నగరానికి రావడానికి తిరుపతి రైల్వేస్టేషన్లో తిరుపతి-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైల్లో కుర్చోని కాచిగూడ రైల్వేస్టేషన్కు వస్తుండగా మార్గమధ్యలో గద్వాల్ రైల్వేస్టేషన్లో సోమవారం తెల్లవారు జమూన చూసుకునేసరికి బ్యాగులో ఉన్న 20 గ్రాముల బంగారు అభరణాలను దొంగిలించారు.
సోమవారం కాచిగూడ రైల్వే పోలీసులకు వినిష్కుమార్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం మహబూబ్నగర్ రైల్వే పోలీస్స్టేషన్కు బదిలీ చేసినట్లు రైల్వే హెడ్కానిస్టేబుల్ బిజి ప్రసాద్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్కూళ్లు ఇలా మూసి ఉండటం చాలా ప్రమాదకరం.. వెంటనే తెరవండి!
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావుకు నివాళులు అర్పించిన వినోద్ కుమార్
మోదీజీ పుట్టగొడుగులు మానేసి ఐదు రోజులు ఈ ఆహారం తీసుకోండి!
ఆధ్మాత్మికతో పాటు ఆహ్లాదానికి ప్రాధాన్యం : మంత్రి ఐకే రెడ్డి
సమాజానికి దారి చూపే రచనలు రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్