భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం జరిగింది. నగరంలోని ఎంపీ నగర్ ప్రాంతంలో బుధవారం ఓ బాలిక తన ఫ్రెండ్ బర్త్డే పార్టీలో పాల్గొని తిరిగివస్తుండగా బైక్పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమె ముఖంపై బ్లేడ్తో దాడి చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసోంకు చెందిన బాధిత బాలిక (19) భోపాల్లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. నిందితులు సలీం, సుమర్ బాలికను అడ్డగించి బ్లేడుతో ఆమె ముఖాన్ని గాయపరిచిన అనంతరం పారిపోయారు. స్ధానికులు వెంటనే బాలికను సమీప దవాఖానకు తరలించారు. నిందితులు తమ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి తమతో రావాలని ఒత్తిడి తెచ్చారని బాధితురాలు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.