వెంగళరావునగర్, ఆగస్టు 16 : ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు కథనం మేరకు..బోరబండలోని వినాయకరావు నగర్కు చెందిన చల్లా రాము కుమార్తె చల్లా రాజేశ్వరి(16) శనివారం తెల్లవారుజామున ఎరిరితోనూ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఉదయం ఇంట్లో కూతురు కనిపించకుండా పోయేసరికి ఆమె ఆచూకీ కోసం బంధువులతో పాటు ఇరుగుపొరుగు వారిని ఆరా తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దీంతో రాజేశ్వరి తల్లిదండ్రులు ఆదివారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.