లక్నో : మంచినీళ్ల కోసం పొరుగింటికి వెళ్లిన బాలికకు నిప్పంటించిన ఘటన యూపీలోని బులంద్షహర్లో వెలుగుచూసింది. కాలిన గాయాలతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మంగళవారం మరణించింది. బులంద్షహర్ జిల్లా కొత్వాలి ప్రాంతంలో నీటి కోసం పొరుగింటికి వెళ్లిన బాధితురాలికి నిప్పంటించడంతో తీవ్రంగా కాలిన గాయాలైన ఆమెను ఢిల్లీ ఆస్పత్రికి తరలించారు.
కాలిన గాయాలతో మంగళవారం ఉదయం ఆమె మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా ప్రేమ వ్యవహారంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని అనుమానిస్తున్నారు. నిందితుడిని పోలీసులు ఇంతవరకూ అరెస్ట్ చేయలేదు.