సూర్యాపేట : కామంతో కండ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని ఐదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామాంధునికి బుధవారం సూర్యాపేట రెండో అదనపు జిల్లా న్యాయస్థానం 20 యేండ్ల కఠిన కారాగార శిక్ష, ఇరవైవేల జరిమానా విధించింది. జరినామా చెల్లించని పక్షంలో దోషి అదనంగా 6 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేటలోని అన్నాదురై నగర్కు చెందిన బీమ్ శెట్టి నాగరాజు (38) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఆదే కాలనీలో స్కూల్ పిల్లలను ఆటోలో స్కూల్లో దింపి మరల స్కూల్ నుంచి ఇంటి వద్ద విడిచి వెళ్తుంటాడు. కాగా, అదే ప్రాంతానికి చెందిన ఓ బాధితురాలు నవోదయ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నది.
ఈ నేపథ్యంలో బాలిక కడుపులో నొప్పిగా ఉందని తల్లితో చెప్పడంతో వైద్యుడికి చూపించారు. అయినా తగ్గకపోవడంతో చర్మవ్యాధుల హాస్పిటల్లో చూపించగా బాలికను పరీక్షించిన డాక్టర్ ఆమెపై లైంగిక దాడి జరిగిందని తెలిపాడు.
దీంతో పాపను ఏం జరిగింది అని అడుగగా ఆటో డ్రైవర్ నాగరాజు స్కూల్ వదలగానే వచ్చి ఆటోను చద్దల చెరువు గట్టు పైకి తెచుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. బాధితురాలి తల్లి పోలీసులకు 17-03-2016 న ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని అప్పటి సూర్యాపేట సీఐ మొగులయ్య నిందుతునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనంతరం 12 మంది సాక్షులను విచారించి న్యాయస్థానం నాగరాజును దోషిగా నిర్ధారిస్తూ శిక్షు ఖరారు చేసింది. ప్రాసిక్యూషన్ తరుపున పీపీ గ్రంధి వెంకటేశ్వర్లు వాదించారు.