ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం జరిగింది. పదవ తరగతి చదువుతున్న బాలిక (16)పై రెండేండ్లుగా వావివరసలు మరిచి కన్నతండ్రి, సోదరుడు పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్కూల్ టీచర్, ప్రిన్సిపల్కు బాలిక తన గోడు వెళ్లబోసుకోవడంతో ఈ దారుణం బయటపడింది. స్కూల్ అధికారులు ఓ ఎన్జీవోను సంప్రదించగా వారు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2019 జనవరిలో బాలిక నిద్రిస్తుండగా తండ్రి (43) తొలుత లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై అదే నెలలో సోదరుడు (20) కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన చెల్లెలుపై కూడా తండ్రి, సోదరుడు లైంగిక దాడులకు పాల్పడతారనే భయంతో బాధితురాలు ఈ విషయం బయటపెట్టిందని పోలీసులు తెలిపారు. బాలిక ఫిర్యాదుతో పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు.
ఇక మహారాష్ట్రలోని పుణేలో ఇటీవల జరిగిన మరో ఘటనలో వదిన స్నానం చేస్తుండగా వీడియో తీసి ఆ క్లిప్ను చూపుతూ బ్లాక్మెయిల్ చేసి లైంగిక దాడులకు పాల్పడిన మరిదిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో క్లిప్ను వైరల్ చేస్తానని మరోసారి నిందితుడు లైంగిక దాడికి ప్రయత్నించడంతో విసిగిపోయిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.