కొత్తూరు : రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని ఇండియన్ గ్యాస్ ట్యాంకర్ ఢీ కొట్టిన సంఘటన కొత్తూరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరుకు చెందిన పిట్టల శ్రీశైలం (20) తిమ్మాపూర్ నుంచి కొత్తూరుకు బుల్లెట్ వాహనంపై వస్తున్నాడు. అయితే ఇండియన్ గ్యాస్ గోదాం వద్దకు రాగానే గ్యాస్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న శ్రీశైలం డివైడర్పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్యాస్ ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించామని వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.