వికారాబాద్ : గంజాయి అమ్మిన, కొన్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రానికి చెందిన మహేల్ అనే మహిళ రైల్వేస్టేషన్ సమీపంలో ఫుట్పాత్పై గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసింది. అక్కడి నుంచి వికారాబాద్కు వచ్చి రైల్వేస్టేషన్ సమీపంలో సాతయ్య, మోయిజ్లకు అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని, ఒక మహిళ, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎవరైన గంజాయి అమ్మినా, కొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.