ముంబై : బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య చిక్కుల్లో పడ్డారు. కొరియోగ్రాఫర్ కో డ్యాన్సర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై లైంగిక వేధింపులు సహా పలు అభియోగాలను చార్జిషీట్లో నమోదు చేశారు.
మహిళా కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై ఆయనపై గత ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గణేష్ ఆచార్యపై ఆయన అసిస్టెంట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం రేపింది. గణేష్ కోరికను తీర్చేందుకు నిరాకరించడంతో ఆయన తనను వేధించాడని, తనతో బలవంతంగా అశ్లీల వీడియోలు చూసేలా ఒత్తిడి చేశాడని ఆరోపించింది.
కొరియాగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి తన సభ్యత్వాన్ని తీసివేయించాడని పేర్కొంది. గణేష్పై వేధింపుల ఆరోపణలు ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన తనపై వదంతులు ప్రచారం చేసి తన ప్రతిష్టను దెబ్బతీశాడని నటి తనుశ్రీ దత్తా ఆరోపించారు. నానా పటేకర్తో కలిసి గణేష్ ఆచార్యపై ఆమె ఫిర్యాదు చేశారు. ఇక 2008లో హార్న్ ఓకే ప్లీజ్ మూవీకి గణేష్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు.