వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
పర్వతగిరి, సంగెం పోలీసు స్టేషన్, సిబ్బంది గృహ సముదాయాల సందర్శన
పర్వతగిరి, జూన్ 10 : లాక్డౌన్ పకడ్బందీగా అమ లు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూ చించారు. గురువారం పర్వతగిరి పోలీస్స్టేషన్ను సందర్శించారు. వెస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు సీఐ పుల్యాల కిషన్తో కలిసి పోలీస్స్టేషన్ను, పోలీసు సి బ్బంది గృహ సముదాయాలను పరిశీలించారు. అనంత రం సిబ్బంది పని తీరును వ్యక్తి గతంగా అడిగి తెలుసుకున్నారు. పోలీసు స్టేషన్ పరిధిలో అధికంగా జరిగే నేరా లు, నమోదయ్యే కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా నేరాల నియంత్రణకు పోలీసులు చేపట్టిన చర్యలు, ముందస్త్తు చర్యలపై కమిషనర్ ఆరా తీశారు. అనంతరం పోలీసు కమిషనర్ సిబ్బందితో మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు. లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేయడంతో పాటు రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారులపై కేసులను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పర్వతగిరి ట్రైనీ ఎస్ఐ రాజేందర్ సీపీకి పూల మొక్కను బహుకరించారు. పోలీసులు తదితరులు పాల్గొన్నారు.
సంగెం పోలీస్స్టేషన్ తనిఖీ..
సంగెం : కొవిడ్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ తరుణ్జోషి సూచించారు. సం గెం పోలీస్స్టేషన్ను గురువారం సీపీ తరుణ్జోషి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సన్నిహిత కౌంటర్ ఇన్చార్జి మహిళా కానిస్టేబుల్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసుస్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు నమోదైన కేసులను పరిష్కరించడం కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలపై ఎస్సై ఎం సురేశ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకురులతో మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసుస్టేషన్ను సందర్శించినట్టు పేర్కొన్నారు. లాక్డౌన్పై చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు బాగుందన్నారు. ఈ కార్యక్రమాలో ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, పర్వతగిరి సీఐ పుల్యాల కిషన్, ఎస్సై ఎం సురేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.