ఆసిఫాబాద్ : అక్రమంగా కలప దుంగలను తరలిస్తున్న కలపస్మగర్లపై అటవి శాఖ అధికారులు దాడులు చేసి 22 కలప దుంగలను పట్టుకున్నారు. ఆసిఫాబాద్ అటవీ రేంజ్ అధికారి అప్పలకొండ తెలిపిన వివరాల ప్రకారం .. డివిజన్ పరిధిలోని ఉపరితల గనుల వద్ద ఆదివారం ముందస్తు సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆసిఫాబాద్, తిర్యాణి రేంజ్ సరిహద్దు ప్రాంతమైన దంతన్పల్లి, కైరిగూడ ప్రాంతంలో అనుమానస్పదంగా కనిపించిన కారును సోదా చేశామని ఆయన వివరించారు. కారును తనిఖీ చేయగా అందులో రూ. 89,613 విలువ గల 22 దుంగలు స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు.
కలప తరలిస్తున్న మాదారం గ్రామానికి చెందిన గొర్లపెళ్లి మహేశ్, సురేశ్, నరేశ్, కల్యాణ్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా కలపనుతరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో డిప్యూటీ రెంజ్ అధికారి ప్రవీణ్కుమార్, సెక్షన్ అధికారులు విజయ్కుమార్, మహేందర్, బీట్ అధికారులు స్వప్న పాల్గొన్నారు.