పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడి కన్నతల్లినే హత్యచేసిన కన్న కొడుకును అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని ఖుదావంద్పూర్ గ్రామానికి చెందిన ఎరోళ్ల భీమమ్మను కొడుకు బలవంత్, పింఛన్ డబ్బుల కోసం గొడవపడ్డాడు. అదే విధంగా తల్లిని చంపేస్తే రైతుబీమా డబ్బులు వస్తాయన్న దురాశతో శుక్రవారం రాత్రి తల్లితో గొడవపడి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా తన తల్లి చనిపోయిందని పక్కనే ఉన్న తన చిన్నమ్మ రాములమ్మకు చెప్పడంతో ముందునుంచి బలవంత్పై అనుమానం ఉన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బలవంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రిమాండ్ చేసి జైలుకు పంపినట్లు సిఐ తెలిపారు.