రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో సోమవారం విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇంటి గోడకూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పఖంజోర్ ప్రాంతంలోని ఇర్పనార్ గ్రామంలో ఇంట్లో నివసిస్తున్న సమయంలో మట్టిగోడ కూలిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు సైతం ఘటనలో ప్రానాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని, పరిశీలించారు.