Road Accident | సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న గుంతలో కారు పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు.
ఇద్దరు గాయపడగా.. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మరొకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులకు సంబంధించి వివరాలు తెలియరాలేదు. మృతులు ఎక్కడికి చెందిన వారు? ఎక్కడికి వెళ్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.