సిరిసిల్ల రూరల్ : రాజరాజేశ్వర ప్రాజెక్టు (మధ్య మానేరు)లో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు మృత్యువాతపడ్డాడు. తంగళ్ళపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు పరుశరాములు (54) రోజు మాదిరిగానే మంగళవారం తోటి మత్సకారులతో కలిసి మధ్య మానేరులోకి చేపలవేటకు వెళ్లాడు. తెప్పలపై వెళ్తూ నీటిలో కూలిపోయాడు. గమనించిన తోటి మత్స్యకార్మికులు పరుశరాములును ఒడ్డుకు తీసుకురాగా.. ఇప్పటికే మృతి చెందాడు. సంఘటనా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.