జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్లో విషాదం నెలకొంది. చేపల వేటకు వెళ్లిన మత్య్సకారుడు ఆర్మూర్ నర్సయ్య (44) నీటమునిగి మృతిచెందాడు.
వివరాల్లోకెళితే, ఆర్మూర్ నర్సయ్య చేపలు పట్టేందుకు ఊరిచెరువులోకి దిగాడు .అయితే, ప్రమాదవశాత్తూ చేపలవల తట్టుకొని నీటిలో మునిగి చనిపోయాడు. గమనించిన గ్రామస్తులు అతడిని ఒడ్డుకు చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివరాలు అడిగి తెలుసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. నర్సయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురున్నారు.