కోల్కతా : కలకత్తా హైకోర్టులో అగ్నిప్రమాదం జరగడంతో కోర్టు ప్రాంగణంలో భయాందోళన నెలకొంది. కోర్టురూం 34లో శుక్రవారం ఉదయం 10.45 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో అక్కడున్న పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం ఘటనకు సంబంధించి పలు వివరాలు వెల్లడవుతాయని చెప్పారు.