రంగారెడ్డి : రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్దేవ్పల్లి టాటానగర్లో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ కారు షెడ్డులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షెడ్డులో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. మంటలకు తోడు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు షెడ్డు యజమాని పేర్కొన్నాడు. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.