వెంగళరావునగర్ : ఎస్.ఆర్.నగర్ లోని జలమండలి కార్యాలయంలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
ఎస్.ఆర్.నగర్ లోని జల మండలి ప్రాజెక్ట్ డివిజన్-2 కార్యాలయంలో ఉదయం 8.30 గంటల సమయంలో మంటలు చెలరేగడంతో ప్రాజెక్టు డివిజన్ జీఎం డ్రైవర్ లక్ష్మీ నారాయణ అగ్ని మాపక శాఖ తో పాటు పై అధికారులకు సమాచారం అందించారు. దీంతో సనత్ నగర్ అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైరింజన్తో సిబ్బంది సంఘట స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే అగ్నికీలలు ఎగసిపడటంతో ప్రాజెక్ట్ డివిజన్-2 కార్యాలయంలోని సామగ్రి మొత్తం కాలిపోయింది. టెబుల్స్, కర్చీలు, ఫ్యాన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, కీలక పత్రాలు మొత్తం బూడిదయ్యాయి. ఇందులోనే ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టు పత్రాలు కూడా ఉన్నట్లు ప్రాజెక్టు డివినజ్-2 మేనేజర్ ఇ.వెంకటేశ్వర్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా అధికారులు జాగ్రత్రలు తీసుకోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు.