హైదరాబాద్ : రాజేంద్రనగర్లోని హైదర్గూడలోని విస్టా సిటీ అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఐదో అంతస్తులోని 521 ప్లాట్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అపార్ట్మెంట్ వాసులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసింది.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నికీలలు ఎగిసిపడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేశారు.