పహాడీషరీఫ్ : వ్యక్తి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ వివరాల ప్రకారం.. శ్రీరామకాలనీలో నివాసముంటున్న రవి గౌలిగూడలో చెప్పుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
17న తన భార్యతో గొడవపడి 18న సాయంత్రం 6 గంటలకు ఇంట్లో సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేడు. భార్య లలిత ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.