రంగారెడ్డి : నార్సింగిలో నిన్న రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్నపోతు ఊరేగింపులో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. కొట్టుకునే దాకా దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాల వారు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ఇరు వర్గాలను చెదరగొట్టారు. వెంకటేశ్ యాదవ్, అశోక్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.