అమరావతి : ఏపీలోని తెనాలిలో ఓ కుటుంబం ఆత్మహత్యా్యత్నానికి (suicide) పాల్పడింది. వీరిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. జిల్లాలోని నాజర్పేటకు చెందిన శివశంకర్రావు, నాగమణి దంపతులు . వీరికి హారిక అనే కూతురు ఉంది. కూతురు వివాహానికి చేసిన అప్పులు(Debt) తీర్చలేక బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు . గమనించిన స్థానికులు ముగ్గురిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భార్య నాగమణి మృతి చెందింది. భర్త శివశంకర్రావు, కుమార్తె హారిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.