యాదాద్రి : ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందడంతో పాటు, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మోటకొండూర్ మండలంలోని కాటేపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివరాత్రి గౌరమ్మ(45) ఇంట్లో ఫ్యాన్కు వచ్చే కరెంట్ తీగ నుంచి ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడం గమనించుకుండా బట్టలు ఆరేసింది. దీంతో కరెంటు షాకు గురైంది. ఇది గమనించి కాపాడే ప్రయత్నం చేసిన మృతురాలి కుమారుడు వెంకటేశ్ సైతం కరెంటు షాకుకు గురయ్యాడు.
స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం భువనగిరి సర్కార్ దవాఖానకు తరలించగా పరిక్షించిన వైద్యులు గౌరమ్మ అప్పటికే మృతి చెందినట్లు, వెంకటేశ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు నిర్ధారించారు. మృతుడి కటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.