రాంచీ: ఫ్యామిలీ టూర్ విషాదంగా మారింది. పడవ బోల్తా పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మరణించారు. జార్ఖండ్లోని కొడెర్మా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రాజ్ధన్వార్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఆదివారం ఉదయం పంచఖేరో డ్యామ్ వద్దకు వెళ్లింది. ఒక అద్దె పడవలో షికారుకు వెళ్లారు. అయితే ఆ పడవ డ్యామ్లో బోల్తా పడింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 9 మందిలో 8 మంది నీటిలో మునిగి మరణించారు. మృతులను శివమ్ సింగ్ (17), పాలక్ కుమారి (14), సీతారాం యాదవ్ (40), సెజల్ కుమారి (16), హర్షల్ కుమార్ (8), భావ (5), రాహుల్ కుమార్ (16), అమిత్ కుమార్ (14)గా గుర్తించారు.
కాగా, ఆ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఈది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, జాతీయ విపత్తి ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం వెంటనే రంగంలోకి దిగారు. డ్యామ్లో మునిగిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ డ్యామ్ వద్దకు చేరుకున్నారు.