బెంగళూర్ : ఎలక్ట్రిక్ బైక్లు కాలుతున్న ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా కర్నాటకలోని హోసూర్లో శనివారం ఈ-బైక్ దగ్ధమైంది. బెంగళూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే బైక్ యజమాని ఈ ఘటనలో సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించింది.
బ్యాటరీ ప్యాక్ నుంచి పొగ రావడం గమనించిన బైక్ యజమాని వెంటనే వాహనాన్ని నిలిపివేసి పక్కకు జరిగాడు. దీంతో ఈ-బైక్ పూర్తిగా దగ్ధం కాగా యజమాని క్షేమంగా బయటపడ్డాడు. ఐప్రైజ్ మోడల్కు చెందిన ఈ ఈ-బైక్ ఒకినవ కంపెనీకి చెందినది కావడం గమనార్హం.