ముఖంపై మొటిమల సమస్యతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నది. పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయిలు మొటిమల కారణంగా ఆమెను తిరస్కరించారు. దీంతో పెళ్లి కుదరడం లేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లా బిసంద పోలీస్ సర్కిల్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో జరిగింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ యువతి ఉరివేసుకుంది. పశువులకు మేత వేసి ఇంటికి వచ్చిన ఆమె తల్లి, సోదరి గమనించి లబోదిబోమన్నారు. ఎన్ని చికిత్సలు చేసినా మొటిమల సమస్య తగ్గలేదని, పెళ్లి సంబంధాలు కుదరలేదని వారు తెలిపారు. దీంతో మనస్తాపం చెంది తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని యువతి తల్లి పేర్కొంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బిసాండ పోలీస్ సర్కిల్ ఇన్ఛార్జ్ కేకే పాండే తెలిపారు.