ఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఢిల్లీలోని సుందర్ నగరి ప్రాంతంలో దివ్యాంగ ముస్లిం వ్యక్తిని ఆలయంలో ప్రసాదం తిన్నందుకు పలువురు అతడిని స్తంభానికి కట్టేసి కొట్టడంతో మరణించాడు. మూక హత్యకు పాల్పడిన పలువురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహ్మద్ ఇసార్ అనే వ్యక్తిపై పలువురు దాడిచేసి స్తంభానికి కట్టేసి కొట్టారు.
ఆపై కొద్దిసేపటికి అతడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో బాధిత వ్యక్తిని పలువురు వ్యక్తులు కర్రలతో కొడుతుండటం కనిపించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆ ప్రాంతంలో పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు.
ఘటనకు బాధ్యులందరినీ గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అదే ప్రాంతంలో ఓ హిందూ బాలుడి హత్యోదంతంతో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
BJP hate speech | విద్వేష ప్రసంగాల్లో బీజేపీనే టాప్.. హిందూత్వ వాచ్ సంస్థ వెల్లడి