న్యూఢిల్లీ : కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు దేశంలో విద్వేష ప్రసంగాలు పెరిగాయని తాజా అధ్యయనంలో తేలింది. మైనార్టీలే లక్ష్యంగా మొత్తం 255 విద్వేష ప్రసంగాలు చోటుచేసుకోగా, ఇందులో 80 శాతం కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే నిర్వహించారని హిందూత్వవాచ్ అనే సంస్థ పేర్కొన్నది. విద్వేష ప్రసంగాల్లో బీజేపీ నేతలే ఎక్కువగా ఉన్నారని వెల్లడించింది. ‘హిందుత్వ వాచ్’ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తున్న ఓ రిసెర్చ్ గ్రూప్. నివేదికలోని అంశాల్ని బీజేపీ నాయకుడు అభయ్ వర్మ ఖండించారు. అందులో పేర్కొన్న అంశాలు పూర్తిగా నిరాధారమన్నారు.