హైదరాబాద్ : ఫోన్ గేమ్స్కు అలవాటు పడ్డ యువకుడు దాదాపు కోటి రూపాయల వరకు పోగొట్టాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. డిగ్రీ విద్యార్థి మొబైల్లో ‘గేమ్కింగ్’ యాప్ను డౌన్లోడ్ చేశారు. గేమ్ ఆడేందుకు అకౌంట్ డబ్బులు చెల్లించాల్సి రావడంతో అకౌంట్ నుంచి లింక్ ఇస్తూ ఆడుతూ వచ్చాడు రూ.95లక్షల వరకు పోగొట్టాడు.
యువకుడి తండ్రి భూ నిర్వాసితుడు కాగా.. కొన్నాళ్ల కిందట రూ.95లక్షల పరిహారం వచ్చింది. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాలో ఉంచాడు విద్యార్థి తండ్రి. ఈ సొమ్మునంతా విద్యార్థి హర్షవర్ధన్ పోగొట్టాడు. పరిహారంగా వచ్చిన సొమ్ము బ్యాంకు ఖాతాలో లేకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బుల మాయంపై సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసి.. న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.