వెంగళరావునగర్ : కాలేజ్కు వెళ్లకుండా బయట తిరుగుతున్నందుకు తండ్రి మందలించడంతో.. మనస్తాపంతో డిగ్రీ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం..బోరబండ ఇందిరానగర్కు చెందిన ఎ.విఠల్కు ముగ్గురు కొడుకులున్నారు.
వీరిలో చిన్నవాడైన ఎ.సురేష్ (21) బీకాం ఫైనలియర్ చదువుతున్నాడు. గత వారం రోజులుగా కాలేజ్కు వెళ్లకుండా బయట తిరుగుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాం చెందిన సురేష్ గురువారం అర్ధరాత్రి ఇంటి ముందున్న షెడ్డు ఇనుప రాడ్డుకు చీరతో ఉరేసుకున్నాడు.
ఉదయాన్నే ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సురేష్ను స్థానికంగా ఓ దవాఖానాకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి విఠల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.