అబిడ్స్ : సైదాబాద్ సింగరేణి కాలనీ సంఘటన మరవక ముందే నగరంలోని మంగళ్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది సంవత్సరాల బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న మంగళ్హాట్ పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. గోషామహల్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ ఎం నరేందర్రెడ్డి, మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ జి రణవీర్రెడ్డిలు కేసు వివరాలను వెల్లడించారు.
అఫ్జల్సాగర్ ప్రాంతానికి చెందిన దంపతులు ఈ నెల 15న తమ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమను నిమజ్జనం చేసి రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తరువాత భార్యా, భర్తల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకోగా భర్త భార్యతో గొడవపడి చితకబాదాడు. దీంతో ఆమె హబీబ్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు భార్యా, భర్తలు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు. ఇంటికి చేరుకోగా తమ తొమ్మిది సంవత్సరాల కూతురు కనిపించక పోవడంతో వారు అమ్మాయిని వెతకడం ప్రారంభించారు. కాగా అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బాలిక మెయిన్ రోడ్పై కనిపించడంతో ఆమెను వాకబు చేయగా ఆమెపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని తెలుసు కున్నారు. వారు మంగళ్హాట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచారం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి నిందితున్ని పట్టుకునేందుకు గాను ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ టీవీలలో నమోదైన రికార్డులను పరిశీలించి అత్యాచారానికి పాల్పడిన యువకుడు అఫ్జల్సాగర్ ప్రాంతానికి చెందిన హతగాడే సుమిత్ (19)గా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సంఘటన జరిగిన కొన్ని గంటలలోనే నిందితున్ని మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ జి రణవీర్రెడ్డి నేతృత్వంలో పోలీసులు అరెస్ట్ చేసి ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. ఈ కేసును జాయింట్ కమిషనర్ ఎఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో గోషామహల్ ఏసీపీ ఎం నరేందర్రెడ్డి పర్యవేక్షణలో మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ జి రణవీర్రెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.