లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత వ్యక్తిని గ్రామ పెద్ద చెప్పుతో కొట్టాడు. మరో వ్యక్తి కూడా అతడ్ని కొట్టాడు. అంతే గాక కులం పేరుతో దూషించడంతోపాటు చంపుతామని అతడ్ని బెదిరించారు. ముజఫర్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తాజ్పూర్ గ్రామ పెద్ద శక్తి మోహన్ గుర్జార్, దళితుడైన 27 ఏళ్ల దినేష్ కుమార్ను తొలుత చేతితో అనంతరం చెప్పుతో కొట్టాడు. రెటా నాగ్లా గ్రామానికి చెందిన గ్రామ మాజీ సర్పంచ్ గజే సింగ్ కూడా అతడిపై చేయి చేసుకున్నాడు. ఆ దళిత వ్యక్తిని కులం పేరుతో దూషించడంతోపాటు చంపుతామని బెదిరించారు. అంతేగాక ఈ సంఘటనను వీడియో తీశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. స్పందించిన పోలీసులు ఆ ఇద్దరిపై ఐపీసీ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. గ్రామపెద్ద శక్తి మోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ గ్రామ పెద్ద కోసం వెతుకుతున్నారు.
కాగా, భీమ్ ఆర్మీ, దళిత సంఘాల కార్యకర్తలు ఈ సంఘటనను ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఛపర్ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసన చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు.
In UP's Muzaffarnagar, a village head and his people thrashed a SC youth with slippers in public and threatened him with death while abusing caste slurs.
They also recorded the incident and made it viral to humiliate the SC people.
pic.twitter.com/MeiPTfo9KF— Mission Ambedkar (@MissionAmbedkar) August 20, 2022