హైదరాబాద్: ఎన్నికల వేళ అనేక చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్ప సినిమాను మరిపించేలా ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్లో రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన విషయం మరువకముందే.. అచ్చం అలాంటి ఘటనే వార్తల్లో నిలిచింది. గోపయ్య అనే వృద్ధుడు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని (Liquor Bottles) ఆంధ్రకు తరలిస్తూ పట్టుబడ్డాడు.
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చెక్పోస్టు వద్ద తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ స్కూటర్ను పోలీసులు ఆపారు. గోపయ్య వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటంతో ఆ స్కూటర్ను తనీఖీ చేశారు. దీంతో అందులో తెలంగాణలో తయారైన మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా తీయగా మొత్తం వంద క్వార్టర్ బాటిళ్లు లభించాయి. కోదాడ నుంచి నందిగామకు తరలిస్తున్నట్లు గోపయ్య వెల్లడించారు. దీంతో బైకుతోపాటు మద్యం సీసాలను పోలీసులు సీజ్ చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముసలోడు మామూలోడు కాదు.. పుష్ప 2 సినిమాను ముందే చూపించాడు.
ఎన్టీఆర్ – నందిగామలో ముసలోడు గోపయ్య కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యం తరలింపు.
స్కూటీని మందు షాపుగా మార్చి తెలంగాణ నుండి ఆంధ్రాకు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా మద్యం తరలింపు.
నందిగామ పట్టణ శివారులో పట్టుకున్న… pic.twitter.com/smvpuYL50s
— Telugu Scribe (@TeluguScribe) May 3, 2024
పుష్ప 3 హీరోని చూడండి!
స్పెషల్ జాకెట్ ధరించి 20 లక్షల నగదును తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న పోలీసులు
ఖమ్మం – పోలీసులు తనిఖీలు చేస్తుండగా టూ వీలర్పై విజయవాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా, వ్యక్తి రెండు చొక్కాలు తొడుక్కుని దానికి జేబులు కుట్టిoచి దాంట్లో 20 లక్షల… pic.twitter.com/rwNGc2ehTI
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2024