లక్నో : యూపీలోని ఫిలిబిత్ జిల్లాలో దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి ఆపై నిప్పంటించిన ఘటనలో బాధితురాలు మరణించింది. కున్వర్పూర్ గ్రామంలో ఈనెల ఆరంభంలో టీనేజర్పై సామూహిక లైంగిక దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
లైంగిక దాడికి పాల్పడిన అనంతరం బాలికపై నిందితులు డీజిల్ పోసి నిప్పంటించారు. లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 12 రోజుల తర్వాత బాధితురాలు మరణించింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. లక్నోలో పోస్ట్మార్టం నిర్వహించిన అనంతం బాధితురాలి మృతదేహాన్ని ఫిలిబిత్లోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.