హైదరాబాద్ : బజాజ్ ఫైనాన్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తికి టోకరా ఇచ్చారు. రుణం ఇస్తామంటూ అనిల్ అనే వ్యక్తికి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతా, డెబిట్కార్డు, సీవీసీ నంబర్ సేకరించారు. అనంతరం అనిల్ ఖాతా నుంచి పలు విడతలుగా రూ.9.44 లక్షలు స్వాహా చేశారు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.