మహబూబాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కలకాలం కలిసి ఉంటానని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఈ అమానవీయ ఘటన నెల్లికుదురు మండలం కుంట తండాలో చోటు చేసుకుంది. స్థానికులక కథనం మేరకు.. తండాకు చెందిన గుగులోతు వీరన్నకు గత 10 సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన నాన్క్ (35) తో వివాహం జరిగింది. ఈ దంపతులిద్దరూ తండాలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
కాగా, వీరన్న మూడు నెలలుగా హైదరాబాద్ ఉంటున్నాడు. నాన్క్ కుంట తండాలో కూలీ పని చేసుకుంటూ ఇద్దరు కుమారులతో కలిసి ఇంటి వద్దనే ఉంటున్నది. ఈ నెల 21న (బుధవారం) హైదరాబాద్ నుంచి కుంట తండాకు వచ్చిన వీరన్న భార్యతో గొడవ పెట్టుకున్నాడు. రాత్రి భోజనం చేసి పడుకొన్నాక వీరన్న తన భార్యను కత్తితో పొడిచి చంపి అనంతరం అక్కడి నుంచి పారి పోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.