ముంబై: పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు వెళ్లిన పోలీస్ సిబ్బందిపై వారు దాడి చేశారు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా సంగమ్నేర్లో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని చెదరగొట్టేందుకు వెళ్లిన రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని వారు వెంబడించి దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఐదుగురితో సహా పలువురుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.