నందిగామ : ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ మహిళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నందిగామ మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన ఎరగాని రమేశ్, భార్య శ్వేతా (25) గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ప్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దరాప్యు చేస్తున్నమని సీఐ రామయ్య తెలిపారు.