మొయినాబాద్ : ఇంటర్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెందిన విద్యార్థి పురుగులమందు తాగి ఆత్మహత్యాకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో చోటుచేసుకుంది. సురంగల్ గ్రామానికి చెందిన చేగూరి శ్రీనివాస్గౌడ్ చిన్న కుమారుడు రిషికిరణ్గౌడ్ (16) ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇంటర్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురై పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు సేవించాడు. సేవించిన మూడు రోజుల తరువాత ఆరోగ్య పరిస్థితి విషమించింది.
దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉండే ఓ దవాఖానకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కాని ఆరోగ్య పరిస్థితి మరింత క్షిణించడంతో నగరంలోని ఓ ప్రైవేట్ దవఖానకు తరలించారు. వారం రోజులుగా దవఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు.