వికారాబాద్ : ఎదురేదురుగా వస్తూ రెండు వాహనాలు ఢీకొన్న సంఘటన వికారాబాద్ పట్టణం శ్రీరాంనగర్ కాలనీ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీను తెలిపిన వివరాల ప్రకారం… నవాబుపేట మండలం చించట్పేట నుంచి వికారాబాద్ వైపు వస్తున్న డీసీఎం వికారాబాద్ నుంచి ప్రయాణికులతో సిద్దులూర్ వెళ్తున్న ఆటోను శ్రీరాంనగర్ కాలనీ సమీపంలో ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డీసీఎం డ్రైవర్ అజాగ్రత్తతోనే ఈ ప్రమాదం జరిగిందని తేలడంతో డ్రైవర్ మహమ్మద్రియాజ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.